పవన్, వారాహి పేరిట శ్రీ కమల మల్లేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు

అనంతపురం: కంబదూరు మండలంలో జనహితం కోరే జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టబోతున్న “వారాహి యాత్ర” విజయవంతం కావాలని కంబదూరు మండల జనసేన అధ్యక్షుడు చంద్రమౌళి ఆధ్వర్యంలో కంబదూరు పట్నంలో గల శ్రీ కమల మల్లేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం ప్రత్యేక పూజా అభిషేకం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేరు మీద పూజాకార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గాజుల శ్రీనివాసులు, వడ్డే శ్రీనివాసులు, వెంకటేశులు, తిప్పే స్వామి, అనిల్, చరణ్, రాజన్న, సుబ్రహ్మణ్యం, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.