వారాహి యాత్ర విజయవంతం కావాలని పీలేరులో ప్రత్యేక పూజలు

పీలేరు: పవన్ కళ్యాణ్ చేస్తున్న వారాహి యాత్ర కార్యక్రమము విజయవంతం కావాలి అని పీలేరు నియోజకవర్గం లో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో 101 టెంకాయిలు కొట్టి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమములో జిల్లా కార్యదర్శి కలప రవి, కెవి పల్లి మండల అధ్యక్షులు టి మహేష్ కుమార్, పీలేరు మండల ప్రధాన కార్యదర్శి పవన్, గజేంద్ర, హరీష్, దిలీప్, నవీన్, పీలేరు మండలం వీర మహిళ గాయత్రి, నవీన్, షఫీ, రాజేష్, పాండు, రాకేష్, విజయ్ పాల్గొని విజయవంతం చేసారు.