విద్యార్థి అమర్నాథ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు జనసేన పోరాడుతుంది

  • చెరుకుపల్లి మండల జనసేన అధ్యక్షులు దూళ్ళ సురేష్

రేపల్లె నియోజకవర్గం: చెరుకుపల్లి మండలంలో వైసీపీ కార్యకర్త వెంకటేశ్వర రెడ్డి కిరాతక చర్యకు బలైన పదవ తరగతి విద్యార్థి అమర్నాథ్.. ఘటన మనసుకు చాలా బాధ కలిగిందని చెరుకుపల్లి మండల జనసేన అధ్యక్షులు దూళ్ళ సురేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసలు ఆ విద్యార్థి తన అక్కను వేధిస్తున్నాడని అడ్డుకోవడం అమర్నాథ్ తప్పా..?. సమాజంలో ఒక ఆడపిల్ల మీద ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని అరాచకాలు ఎన్ని అత్యాచారాలకు గురువుతున్నారు. మనం ప్రతీ రోజూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాము.. కానీ తన సోదరిని వేధిస్తున్నాడని అడిగినందుకు ఒక 10వ తరగతి విద్యార్థిని అత్యంత కిరాతకంగా పెట్రోల్ పోసి చంపడం అనేది ఈ వైసీపీ నాయకుల క్రూరత్వానికి ప్రతీక అని తెలుస్తుంది.! ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగితే గన్ కంటే ముందుగా జగన్ వస్తాడన్న మంత్రి ఎమ్మెల్యే రోజా మాటలు ఏమయ్యాయి?. ఆడపిల్లకి రక్షణగా దిశ చట్టాలు ఏమయ్యాయి? సుగాలి ప్రీతి లాంటి వారికి న్యాయం జరిగే రోజులు రావా?.. కులం చూడం.. మతం చూడం అనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే చంపేస్తారా..? ఎవరికి అన్యాయం జరిగినా మన తన బేధం లేకుండా న్యాయం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అమర్నాథ్ విషయంలో తన పార్టీ కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని శిక్షపడేటట్టు చేస్తాడా?. లేక బాధిత కుటుంబానికి న్యాయం చేస్తాడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గానీ, ఆ పార్టీ నాయకులు గాని విద్యార్థి అమర్నాథ్ విషయంలో వైసీపీ కార్యకర్త వెంకటేశ్వర్ రెడ్డికి శిక్షపడేంతవరకు జనసేన పార్టీ బాధిత కుటుంబానికి అండగా ఉంటూ న్యాయం కోసం పోరాడుతుందని సురేష్ తెలిపారు.