బత్తుల ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు జనసేనలో చేరిక

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, ఇనుగంటి వారి పేట గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ పార్టీకి చెందిన సీనియర్ నేతలు వరదా ప్రభాకర్ రావు, సత్యం భాస్కరరావు. ఈ అసమర్ధ ప్రభుత్వ పాలన పట్ల విసుగు చెంది.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి బత్తుల బలరామకృష్ణ సేవాతత్వం, ప్రజలకు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై నాసేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో సీనియర్ నేత కొండేటి సత్యనారాయణ సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు మట్ట వెంకటేశ్వరరావు, మద్దాల ఏసుపాదం, కొండాటి అనిల్ కుమార్, చిక్కాల నాగ దేవి వరప్రసాద్ (సన్నీ), కొండాటి సత్య, దార్ల బ్రహ్మమ్, వరద వంశీ, మణికంఠ పి.ఎల్.ఎమ్, వర్రే ఈశ్వర్, కొండేటి భద్ర, పెంటపాటి శివ, ఈలి సురేష్, దాసరి వీరబాబు, జయవరపు రాజు, జయవరపు నరసింహామూర్తి, కొలపెల్లి సాయి, చోంగా దుర్గా ప్రసాద్, రాజేష్ సత్యం, దుళ్ల అనిల్ కుమార్, దుళ్ల రామ్ సాయివరద ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.