ముద్రగడకి ఉప్మా డబ్బులు తిరిగి పంపిన పంతం నానాజీ

కాకినాడ రూరల్: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. తాజాగా కాకినాడ జిల్లాలో వారాహి యాత్ర సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ముద్రగడ పద్మనాభం రాసిన లేఖలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాపు ఉద్యమానికి సహాయం చేసినట్లు వెల్లడించిన నేపధ్యంలో జనసేన పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ముద్రగడకు తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ.. అయ్యా! ముద్రగడ పద్మనాభం గారూ.. మీకు నమస్కారాలు. మీరంటే చాలా గౌరవం అండి. మీతో చాలా ఉద్యమాల్లో ప్రయాణం చేశామండీ.. మీరు చెప్పినప్పుడల్లా కంచాలు కుడా కొట్టామండీ.. అలానే చాలా సందర్భాల్లో ఉప్మా కుడా తిన్నామండీ.. మీరు చెప్పిన మాటలను బట్టి ఆది ద్వారంపూడి గారి ఉప్మా అని తేలింది. నేను తిన్న సందర్భాలు అన్నీ లెక్క పెట్టుకుంటే అవి 1000 రూపాయలవరకు తేలింది. ఆడబ్బులు మీకు పంపుతున్నాను. దయచేసి డబ్బులు ద్వారంపూడి గారికి తిరిగి ఇచ్చేయండి. అలానే నా సహచర వ్యక్తులకు విజ్ఞప్తి. మీకు కుడా ద్వారం పూడి గారి ఉప్మా డబ్బులు తిరిగి ఇచ్చేయాలని అనిపిస్తే మీరు తిరిగి పంపేయండి అని జనసేన పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ పేర్కొన్నారు.