నకరికల్లులో జనసేన నాయకులు, కార్యకర్తల ఎన్నికల ప్రచారం

సత్తెనపల్లి: జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ బలపరిచిన సత్తనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణని అలాగే నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలుని గెలిపించాలని ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి తెలియజేసి ఇద్దరి అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ.. మన సత్తెనపల్లిలో సాధించుకోవాల్సిన అభివృద్ధి ఎంతో ఉందని, నకరికల్లులో శంకుస్థాపన చేసిన గోదావరి కృష్ణ పెన్నా నదుల అనుసంధానం 6,200 కోట్ల ప్రాజెక్టును అధికారులకు వచ్చిన వెంటనే త్వరితగతిన పూర్తి చేస్తామని, నకరికల్లు మండలంలో ప్రతిపాదనలో ఉన్న చీమల మర్రి తురకపాలెం గిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పథకాన్ని పూర్తి చేస్తామని సుమారు 800 ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమాన్ని వచ్చిన వెంటనే చేస్తామని, ప్రతి మండలంలో ఒక పీఎం శ్రీ స్కూల్ ఏర్పాటు చేసుకుని మన పిల్లలకు మెరుగైన విద్యను అందిస్తామని, నాగార్జునసాగర్ కాలువను ఆధునికరించుకొని గుంటూరు బ్రాంచ్ కెనాల్,అద్దంకి బ్రాంచ్ కెనాల్,మేజరు, మైనర్లను అభివృద్ధి చేసుకొని సాగునీరు తాగునీరు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీజిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.