అక్రమ మట్టి తవ్వకాలపై జనసేన వినతి పత్రం

రేపల్లె నియోజకవర్గం: నగరం మండలం పరిధిలో ఉన్న బోర మాదిగపల్లె, మట్లపూడి గ్రామ శివారు ప్రాంతాలలో జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాలపై శనివారం స్థానిక ఎం.ఆర్.ఓ ఆఫీస్ లో నగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు గోపరాజు ఉదయ్ కృష్ణ ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న సీనియర్ అసిస్టెంట్ శర్మ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విషయమై స్పందించిన శర్మ గారు స్థానిక వి.ఆర్.ఓలకు ఈ విషయం తెలియపరిచి అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గూడపాటి శ్రీనివాస రావు, అందే సాంబయ్య, పుప్పాల నాగ అంజనేయులు పాల్గొన్నారు.