ఫ్రీ వాటర్ స్కీమ్ ప్రారంభించిన కేటీఆర్

నగరంలోని రెహమత్‌నగర్‌లో ఫ్రీ వాటర్ స్కీమ్ ను మంత్రి కేటీఆర్ మంగళవారం ఉదయం ప్రారంభించారు. అనంతరం రెహమత్ నగర్‌లో ఇంటింటికీ జీరో వాటర్ బిల్లులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేష్ కుమార్, మంత్రులు తలసాని, ఆలీ, మల్లారెడ్డి, మేయర్, డిప్యూటీ మేయర్, ఎమ్మెల్యేలు మాగంటి, దానం, ముఠా గోపాల్ ,వివేక్ పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల హామీలో భాగంగా ఉచిత తాగునీరును తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. గ్రేటర్ హైద్రాబాద్‌లో 10 లక్షల 8 వేల నల్లా కనెక్షన్లకు ఉచిత తాగునీరును అందివ్వనున్నారు. ఈ పథకంతో గ్రేటర్‌లో 97 శాతం మందికి లబ్ది చేకూరనుంది. ఉచిత తాగు నీరు కావాలంటే మార్చి 31 లోపు తప్పనిసరిగా మీటర్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. స్లమ్, బస్తీ ప్రజలకు మీటర్ అవసరం లేదు. 20 వేల లీటర్లు దాటితే బిల్లు కట్టాల్సి ఉంటుంది. 10 లక్షల 8 వేల నల్లా కనెక్షన్లకు ఫ్రీ వాటర్ ఇవ్వడం ద్వారా నెలకు రూ.19 కోట్ల 92 లక్షల ఆదాయాని జలమండలి కోల్పోనుంది.