గొల్లప్రోలు మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన జ్యోతుల

  • దుర్గాడలో పంపన కుటుంబాన్ని, చేబ్రోలులో నల్లరావుల కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు

పిఠాపురం నియోజకవర్గం: జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు బుధవారం గొల్లప్రోలు మండలంలో పలు కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో ముందుగా గొల్లప్రోలు మండలం, దుర్గాడ దుర్గాడ గ్రామం బి.సి కాలనీ మెట్టపై గల పంపన పాపారావు భార్య పంపన నాగలక్ష్మి అనారోగ్యంతో మరణించారు. పంపన పాపారావు స్వగృహానికి జ్యోతుల శ్రీనివాసు వెళ్లి పంపన పాపారావు భార్య పంపన నాగలక్ష్మి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పంపన పాపారావు కుటుంబం ఆర్థికంగా పేదవారు కావడం వల్ల వారికి జ్యోతుల శ్రీనివాసు తగిన ఆర్థిక సహాయం చేసి పంపన పాపారావుకు తగు భరోసాని ఇచ్చారు. అనంతరం గొల్లప్రోలు మండలం, చేబ్రోలు గ్రామానికి చెందిన నల్లరావుల రామకృష్ణ అకాలంగా మరణించారు. నల్లరావుల రామకృష్ణ స్వగృహానికి జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు వెళ్లి నల్లరావుల రామకృష్ణ సోదరులు నల్లరావుల రమణ, నల్లరావుల కన్నారావు లను కలిసి నల్లరావుల రామకృష్ణ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల శ్రీనివాసు వెంట బండారు కృష్ణ, చేసెట్టి భద్రం, తీడా లోవరాజు, జ్యోతుల సీతారాంబాబు, మేడిబోయిన శ్రీను, సాధనాల చంటిరాము, పంపన ఏసుబాబు, జ్యోతుల గోపి, గుల్లింకల గోపి, గుండుబిల్లి ముసలి, వెదురుపాక దుర్గాప్రసాద్, ఈర్ల శ్రీను తదితరులు ఉన్నారు.