ప్రమాదకర రోడ్డుతో ప్రాణాలు పోయినా పట్టించుకోరా?

నిర్మల్: భైంసా మండల తిమ్మాపూర్ గ్రామం నుండి విట్టపుర్ వరకూ రోడ్డు అధ్వాన్న స్తితిలో ఉందని జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. మెయిన్ రోడ్ కి పక్కన గల ఊరి పరిస్థితి ఇలా ఉంటే ఇక లోపల గ్రామాల పరిస్థితి చెప్పనక్కర్లేదు.. అసలే వర్షా కాలం ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగినా, గర్భిణీ స్త్రీలను హాస్పిటల్ కి తీసుకు రావాలన్నా ఈ రోడ్ మీద వచ్చేసరికే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి రోడ్డు బాగు చేయాలని జనసేన పార్టీ తరఫున సుంకెట మహేష్ బాబు డిమాండ్ చేసారు.