బెయిల్ పై విడుదలైన జనసేన నాయకుడు కోటా చంద్రబాబు

శ్రీకాళహస్తి నియోజకవర్గం: శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా భర్త కోటా చంద్రబాబు ను చిందేపల్లి గ్రామ రోడ్డు కోసం పోరాటం చేస్తున్నప్పుడు అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపడంతో 13 రోజులు జైల్లో ఉన్న చంద్రబాబు గారికి బెయిలు మంజూరు కావడంతో గురువారంశ్రీకాళహస్తి సబ్ జైలు నుండి విడుదల అయ్యారు. శ్రీకాళహస్తి సబ్ జైలు వద్దకు వందల సంఖ్యలో నాయకులు, జనసైనికులు, వీరమహిళల, చిందేపల్లి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలకడానికి చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి ప్రోద్భలంతో ఈరోజు జనసేన నాయకులు చంద్రబాబు విడుదల అవుతున్నారని తెలిసి రాత్రికి రాత్రి పోలీస్ ఆక్ట్ 30 ఉందని, జైలు వద్దకు చేరుకున్న జనసైనికులపై ఇష్టానుసారం పోలీస్ లు లాఠీ ఛార్జ్ చెయ్యడం జరిగింది. శ్రీకాళహస్తి పట్టణంలోని జనసైనికుల ను రానివ్వకుండా పోలీసుల పహారా కాసి ఎక్కడిక్కడ కార్యకర్తలను అడ్డుకున్నారు. ప్రజల కోసం పోరాడి జైలు నుండి విడుదల అయిన కోటా చంద్రబాబు కు వందల సంఖ్యలో జనసైనికులు, నాయకులు, చిందేపల్లి గ్రామ ప్రజలు క్రేన్ తో పులమాల వేసి ఘన స్వాగతం పలికారు. ఆక్ట్ 30 ఉందని జైలు నుండి నడిచి వెళ్ళడానికి వీల్లేదని పోలీసులు వింత చేష్టలు చేశారు. కారులో వెళ్తూ కారుపై నుండి ప్రజలకి, జనసైనికులకి అభివాదం చేస్తూ వెళ్తుంటే కారుపై నుండి అభివాదం చెయ్యకూడదు, ప్రజలకి కనపడకుడదని అడుగడుగునా అడ్డుకున్నారు. అడుగడుగునా పోలీసులు అడ్డుకుంటూ కనపడ్డ జనసేన కార్యకర్తలను తరిమించి లాఠీ ఛార్జ్ చేసి, ఆఖరికి వినుత, భర్త చంద్రబాబు ల్ను కారు లోపలకి ఎక్కించి పోలీసు బలవంతంగా శ్రీకాళహస్తి పట్టణం లోని వారి ఇంటికి పంపడం జరిగింది. ఇంటికి వెళ్లే దారి చుట్టూ పోలీసులని పెట్టి కార్యకర్తలను ఆఖరికి ఇంటి వద్దకు కూడా రానివ్వకుండా అడ్డుకోవడం జరిగింది. ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి ప్రోద్భలంతో పోలీసులు అత్యుస్తాహాన్ని ప్రదర్శించి వింత వింత గా ప్రవర్తించి అడుగడుగునా కారుకి అడ్డు పడుతూ జైలు నుండి కోటా చంద్రబాబు గారు ఇంటికి చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు గురిచేయడం హేయమైన చర్య. ఎమ్మెల్యే ఇంతలా జనసేన పార్టీ అంటే భయపడి పోలీసు లను అడ్డు పెట్టుకొని ఈ విధమైన దుశ్చర్యలకు పాల్పడడం నీచ రాజకీయాలకు ప్రతీక. త్వరలో ప్రతి దానికి ప్రజలచే సమాధానం చెప్పించే రోజు ఉందని హెచ్చరిస్తున్నాం. జైలు వద్ద కోటా చంద్ర బాబు గారికి స్వాగతం పలకడానికి జిల్లా అధ్యక్షులు డా. హరిప్రసాద్, తిరుపతి ఇంఛార్జి కిరణ్ రాయల్, జి.డి.నెల్లూరు ఇంఛార్జి పొన్ను యుగంధర్, పీలేరు ఇంఛార్జి దినేశ్, సూల్లూరు పేట ఇంఛార్జి ప్రవీణ్, రాష్ట్ర కార్యదర్శి ఆకేపటి సుభాషిణి, మహిళ రీజనల్ కోఆర్డినేటర్ వనజ, వీర మహిళలు నాయకులు, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.