కుశస్థలి నదిపై నిర్మించనున్న ప్రాజెక్టును అడ్డుకుంటాం

  • చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్

గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం: కార్వేటినగరం మండలం, కొత్తూరు గ్రామంలో కుశస్థలి నదిపైన నిర్మించనున్న ప్రాజెక్టును అడ్డుకుంటామని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ పేర్కొన్నారు. కొత్తూరు గ్రామస్తులతో చర్చా కార్యక్రమంలో గ్రామస్తులు సాక్షిగా హరిప్రసాద్ మాట్లాడుతూ కుశస్థలి నది పైన ప్రాజెక్ట నిర్మాణం చేపడితే 9 గ్రామాలు 514 ఎకరాల భూమి ముంపుకి గురవుతుందని దానిని అడ్డుకుని తీరుతామని, డిప్యూటీ సీఎం నారాయణస్వామిని ఉప సర్పంచ్ గా అంటూ పసుపులేటి హరిప్రసాద్ ఘాటు విమర్శలు చేసారు. ఈ కార్యక్రమంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న పీలేరు ఇంచార్జ్ దినేష్ కుమార్, జిల్లా నాయకులు భాను ప్రసాద్, వేణు, రాఘవ, నియోజకవర్గ నాయకులు సురేష్, హరీశ్వర్, మహేష్, నవీన్ రెడ్డి, చంద్రమౌళి, కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, చిరంజీవి, పురుషోత్తం, లతీష్, సురేష్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు విజయ్, సురేష్ రెడ్డి, మాదాసి వెంకటేష్, లోకేష్, ప్రధాన కార్యదర్శులు నరేష్, సోమశేఖర్, సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి, యతీశ్వర్ రెడ్డి, సతీష్, మనీ, నవీన్, వెంకటాద్రి, నరసింహులు, అన్నామలై, ప్రతాప్, సూర్య, చందు, కోఆర్డినేటర్ మురుగేష్, జనసైనికులు, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.