అగ్ని ప్రమాద బాధితురాలికి అండగా నిలచిన జనసేన నాయకులు

పోలవరం నియోజకవర్గం: పోలవరం మండలం, కొత్త కుంకాలకు చెందిన సరస్వతి ఇల్లు శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా బూడిద అయి పోయింది. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ పోలవరం ఇన్చార్జు చిర్రి బాలరాజు ఘటనా స్థలానికి వెళ్లి బాధితురాలిని పరామర్శించి, వారికి జనసేన పార్టీ తరపున మండల ప్రెసిడెంట్ చిన్ని, ఐటీ వింగ్ ఎ.వి, రాము ఆధ్వర్యంలో కూరగాయలు, నగదు 5000 రూపాయల సరుకులు ఇవ్వటం జరిగింది. వారికి జనసేన పార్టీ ఎప్పుడు అండగా నిలుస్తుంది అని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చీకట్ల సాయి, సునీల్, లక్ష్మణ్, కూరసం రమేష్, మరియు జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.