వారాహి యాత్రను విజయవంతం చెయ్యండి.. గాదె

ఇంటి ఇంటికి వారాహి యాత్రలో పాల్గొన్న గాదె వెంకటేశ్వరరావు

వారాహి రథయాత్రని జైత్రయాత్ర చెయ్యండి

కాకినాడ: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తలపెట్టిన వారాహ యాత్ర విజయవంతం కావాలని, 4వ రోజు కాకినాడ టౌన్ లో కాకినాడ నగర అధ్యక్షులు సింగిశెట్టి అశోక్ ఏర్పాటుచేసిన ఇంటి ఇంటికి వారాహి యాత్ర కార్యక్రమంలో జనసేన నాయకులు గాదె వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కాకినాడ సిటీ 27, 28వ డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్లి బొట్టు పెట్టి మరియు వారికి కరపత్రాలు ఇచ్చి వారిని వారాహి యాత్రకు ఆహ్వానిస్తూ పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని బలపరచాలని, వారాహి రథయాత్రని జైత్రయాత్రగా చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాకినాడ టౌన్ కమిటీ సభ్యులు, వార్డు అధ్యక్షులు, జనసైనికులు మరియ వీరమహిళలు పాల్గొన్నారు.