2024 ఎన్నికల్లో రాజానగరంలో జనసేన పార్టీని గెలిపించి గిఫ్ట్ గా ఇస్తాం: గురుదత్
రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కోటికేశవరం గ్రామంలో రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన జనజాగృతి యాత్ర 90వ రోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుకు సాగుతూ ఈ యాత్రలో ముఖ్యంగా జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ప్రతిఇంటికి ఇస్తూ షణ్ముఖ వ్యూహం, జనసేన పార్టీ సిద్ధాంతాలను మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రతిఇంటికి తెలియజేయడం జరిగింది. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 52,000 వేల గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, కోటికేశవరం గ్రామంలో జనసేన పార్టీ తరుపున ఎంపిటిసిగా పోటీచేసిన పొట్నూరి అచ్చియమ్మ, డేగల మహంకాళి, కోచ్చర్ల బాబీ, పోసిబాబు, రాచపోతుల సురేష్, పెమ్మడ సతీష్, కొచ్చర్ల భరత్, తన్నీరు తాతాజీ, అడపా అంజిబాబు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-02-at-23.00.03-1024x580.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-02-at-23.00.02-1024x580.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-02-at-23.00.02-1-1024x768.jpeg)