Kurnool: బేతంచర్ల మున్సిపాలిటీ ఎన్నికలలో నామినేషన్ వేసిన జనసేన

కర్నూల్ జిల్లా డోన్ నియోజకవర్గం బేతంచర్ల మున్సిపాలిటీ నందు జనసేన తరుపున నామినేషన్ వేసిన అభ్యర్థులు శ్రీ లక్ష్మినారాయణ శాస్త్రి 1వ వార్డు, శ్రీమతి చాముండేశ్వరి 9వ వార్డు, శ్రీకాంటి మధు 10వ వార్డు, శ్రీ పొల మధు 8వ వార్డు, శ్రీమతి సునీత 13వ వార్డు శ్రీ చల్ల మద్దిలేటీ 17వ వార్డు, శ్రీమతి సరోజ 20వ వార్డు అభ్యర్థులతో కలిసి జనసేన పార్టీ రాష్ట్ర మహిళా సాధికారత చైర్మన్ శ్రీమతి రేఖ జావ్వాజి, కర్నూల్ జిల్లా జనసేన లీగల్ సెల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, కార్యదర్శి శ్రీ మధుసూదన్, నాయకులు శ్రీ పవన్ కుమార్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు బి-ఫారం అందచేయటం జరిగింది.