వంగవీటి రంగా ఆశయ సాధనకు పునరంకితం అవుదాం

  • గుంటూరు నగరం జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు: పేద బడుగు బలహీనవర్గాల ప్రజల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన రంగా ఆశయ సాధనకు ప్రతీఒక్కరం పునరంకితం అవుదామని గుంటూరు నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. వంగవీటి మోహన రంగా 76వ జయంతి సందర్భంగా స్థానిక శ్రీనివాసరావుతోటలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. జనసేన పార్టీ 22వ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న సురేష్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి కష్టం కలిగినా, ఆపద వచ్చినా రంగా ఇంటి తలుపుతడితే చాలు వారికి కొండంత అండగా నిలిచేవాడన్నారు. కులమతాలకు అతీతంగా ప్రతీ ఒక్కరినీ కంటికి రెప్పలా కాపాడటంలో రంగాని మించిన వారు లేరని కొనియాడారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ వంగవీటి రంగా చనిపోయి నాలుగు దశాబ్దాలు కావస్తున్నా ఇంకా ఆయన స్ఫూర్తి కొనసాగుతుందన్నారు. దురదృష్టవశాత్తు రంగాని ఒక కులానికే పరిమితం చేస్తున్నారని ఆయన ప్రజల మనిషన్నారు. రంగా ఆశయ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆళ్ళ హరి అన్నారు. అనంతరం చుట్టుగుంట సెంటర్లో వీరిశెట్టి సుబ్బారావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో నగర కమిటీ కార్యదర్సులు మెహబూబ్ బాషా, బండారు రవీంద్ర, పాములూరి కోటి, పులిగడ్డ గోపి, షేక్ రఫీ, రామిశెట్టి శ్రీను, కోలా అంజి, కోనేటి ప్రసాద్, మిద్దె నాగరాజు, ఇళ్ల చిరంజీవి, పుల్లంసెట్టి ఉదయ్, వడ్డె సుబ్బారావు, దాసరి రాము, కోలా చిరంజీవి, గిడుతూరి సత్యం, నండూరి స్వామి, గోళ్ల సత్యనారాయణ, గుగ్గిళ్ల సురేష్, జీ బీ వై నాయుడు, పులిగడ్డ నాగేశ్వరరావు, శాంతి కుమార్, మిరియాల వెంకట్, గడ్డం రోశయ్య, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.