నా సేన కోసం నా వంతు కోసం విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ప్రత్తిపాడు జనసేన

ప్రత్తిపాడు, యెద్దు చినబాబు అధ్వర్యంలో ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి వరుపుల తమ్మయ్య బాబు ముఖ్య అతిథిగా నా సేవ కోసం నా వంతు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నా సేవ కోసం నా వంతు అనేటువంటి పార్టీ కార్యక్రమం గురించి ప్రత్తిపాడు నియోజకవర్గం ఇన్చార్జి వరుపుల తమ్మయ్య బాబు సవివరంగా శ్రేణులు అందరికీ వివరించడం జరిగింది. ఇందులో అందరూ పాల్గొనాలని ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క జనసైనికుడు, నాయకుడు, కార్యకర్త, వీర మహిళలు అందరూ తన బాధ్యతగా భావించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా రౌతులపూడి గ్రామంలో కొంతమంది ఓటర్ల వద్దకు వెళ్లి నా సేన కోసం నా వంతు కార్యక్రమం గురించి వివరించి పార్టీ సిద్ధాంతాలను వివరించి పాల్గొనేలాగా చేయడం జరిగింది. ఇందులో భాగంగా కొంతమంది ఓటర్లు ను ఫోన్ పే ద్వారా పాల్గొనేలా ప్రభావితం చేయటం చెప్పుకోదగ్గ అంశం. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆర్.కె,జిల్లా సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు, రౌతూల్పూడి జనసేన పార్టీ మణ్డల అద్యక్షులు పల్లా శేఖర్,బంగారయ్య పేట వెంకీ, మెరక చామవరం కృష్ణర్జున్, ములగపూడి గణేష్, పల్లపు చామవరం శేఖర్, షరీఫ్, సై, భాష, పవన్, ప్రభాకర్ మరియు ఇతర జనసైనికులు, జనసేన పార్టీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.