జనసేన ఆధ్వర్యంలో అల్లూరి సీతారామ రాజు జయంతి ఉత్సవాలు

శేరిలింగంపల్లి నియోజకవర్గం: జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం విప్లవ వీరుడు అల్లూరి సీతారామ రాజు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి జనసేన పార్టీ ఇన్చార్జ్ మాధవ రెడ్డి వందమంది జనసైనికులతో కలిసి బైక్ ర్యాలీగా వెళ్లి మియాపూర్ లోని జెపి నగర్ నందు ఉన్న మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు కాంశ్య విగ్రహానికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాధవ రెడ్డి మాట్లాడుతూ.. నేటి యువత అల్లూరి ఆశయాలను గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్లాలని, ఏ స్ఫూర్తితో అయితే ఆయన పోరాడారో అదే స్ఫూర్తిని నేటి యువత భావితరాల కోసం ముందుకు నడవాలని జనసేన పార్టీ నాయకులు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు కళ్యాణ్ చక్రవర్తి లక్ష్మీనారాయణ, అరుణ్ కుమార్, అశోక్, జి ఎస్ కే శ్రావణ్, సందీప్, హనుమంతు నాయక్, ప్రవీణ్ సాహో, వీరమహిళలు దాక్షాయని, వెంకట్ లక్ష్మి మరియు ఇతర జనసైనికులు పాల్గొన్నారు.