మంగళగిరి జనసేన కార్యాలయంలో వంగవీటి జయంతి వేడుకలు

మంగళగిరి: వంగవీటి మోహన రంగా 76వ జయంతి సందర్భంగా మంగళవారం జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో జనసేన పార్టీ చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన పార్టీ నాయకులు రంగా చిత్రపటానికి పూలమాలవేసి, నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పేద ప్రజల ముద్దు బిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రజా సమస్యలపై ప్రాణాలు సైతం లెక్కచేయకుండా అహర్నిశలు పోరాటం చేసి తన ప్రాణాలు కోల్పోయిన మహానీయుడు, ఇప్పటికి, ఎప్పటికి ప్రజల గుండెల్లో కొలువైన ఉన్న మహా నాయకుడు కీ”శే”స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారి 76వ జయంతి పురస్కరించుకొని జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో రంగా గారికి నివాళులు అర్పించడం జరిగిందని, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రంగా గారి ఆశయాలతో జనసేన పార్టీని స్థాపించి, రంగా గారి ఆశయాలను నెరవేర్చే దిశగా జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, ఎంటిఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు, కాపు సంక్షేమ సేన మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు, ఎంటిఎంసీ సమన్వయ కర్త తిరుమలశెట్టి కొండలరావు, రాష్ట్ర ఐ.టీ విభాగం కోఆర్డినేటర్ చవ్వాకుల కోటేష్ బాబు, చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు, ఎంటిఎంసీ ప్రధాన కార్యదర్శి బాణాల నాగేశ్వరరావు, ఎంటిఎంసీ కార్యదర్శులు బళ్ళ ఉమామహేశ్వరరావు, కుంచా శివనాగ్ కుమార్, కట్టెపోగు సురేష్, తాడేపల్లి మండల ఉపాధ్యక్షులు తంబి, యర్రబాలెం గ్రామ అధ్యక్షులు కాపరౌతు సుందరయ్య, ఉండవల్లి గ్రామ అధ్యక్షులు రాజా రమేష్, బేతపూడి గ్రామ నాయకులు వాసా శివన్నారాయణ, చిల్లపల్లి యూత్ అధ్యక్షులు మేకల సాయి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.