జనసేన జనజాగృతి యాత్ర 91వ రోజు
- మధ్యతరగతి జనసైనికులను నాయకులాగా తయారు చేసి ప్రోత్సహిస్తున్న ఓకే ఒక ప్రజా నాయకుడు గురుదత్ -మండపాక శ్రీను
రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, కోటికేశవరం గ్రామంలో మంగళవారం జనసేన జనజాగృతి యాత్ర 91వ రోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జనసేన జనజాగృతి యాత్ర రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ &ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ అధ్యక్షతన దిగ్విజయంగా ముందుకు సాగుతూ.. కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను ఆధ్వర్యంలో ఈ యాత్రలో ముఖ్యంగా జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ & షణ్ముఖ వ్యూహం ప్రతిఇంటికి ఇస్తూ నియోజకవర్గంలో ఇప్పటికి 52,700 వేల గ్లాసులు పంపిణి చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, కోటికేశవరం గ్రామంలో జనసేన పార్టీ తరుపున ఎంపీటీసీగా పోటీచేసిన పొట్నూరి అచ్చియమ్మ, డేగల మహంకాళి, కోచ్చర్ల బాబీ, పోసిబాబు, రాచపోతుల సురేష్, పెమ్మడ సతీష్, కొచ్చర్ల భరత్, తన్నీరు తాతాజీ, అడపా అంజి బాబు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-04-at-8.51.10-PM-1024x728.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-04-at-8.51.10-PM-1-1024x768.jpeg)