సత్యవేడు జనసేన ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్

సత్యవేడు నియోజకవర్గం, వరదయ్యపాలెం మండలం, సంతవేలూరు గ్రామంలో జనసేన పార్టీ నాయకులు పవన్ కుమార్, శ్రావణ్, వి.కుమార్, గౌతమ్, ఎం.కుమార్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మండల అధ్యక్షుడు చిరంజీవి యాదవ్, సూళూరుపేట ఇన్చార్జ్ ఉయ్యాల ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను జనసేన పార్టీ ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని, యువతకు మానసిక ఆరోగ్యం ఎంతో అవసరం అని తెలియజేసారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు శేఖర్, ఎస్సి విభాగం అధ్యక్షులు ప్రసాద్, సూళూరుపేట మండల అధ్యక్షుడు ఆవుల రమణ, మండల సభ్యులు కేశవ, జగదీష్, కోటి తదితరులు పాల్గొన్నారు.