అందరివాడు ఉప్పాల రాంప్రసాద్: ఎస్ వి బాబు

పెడన, పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ గౌరవించే వ్యక్తి ఉప్పాల రాంప్రసాద్. ఇటీవల ఆయన మరణించడం జరిగింది. ఆదివారం వారి స్వగృహానికి వెళ్లి ఉప్పాల రాముని కలిసి పెడన నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున రాంప్రసాద్ కి ఘన నివాళులు అర్పించడం జరిగింది. భౌతికంగా రాంప్రసాద్ అన్న మనతో లేనప్పటికీ మీ ఆత్మీయ పలకరింపు, మీరు పంచిన ప్రేమ నిర్మలమైన మీ మంచితనం శాశ్వతంగా మా మనసులో ఉంటాయి. ఓ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచలంచెలుగా ఎదిగి తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న అత్యున్నత విలువలు కలిసిన వ్యక్తి ఉప్పాల రాంప్రసాద్. రాజకీయాలు కాదు ముఖ్యం మానవత్వం అని చాటి చెప్పిన మంచి మనిషి రాంప్రసాద్. తమ్ముడు అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించే మా సోదర సమానులు ఉప్పాల రాంప్రసాద్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ ఉప్పాల రాంప్రసాద్ కుటుంబ సభ్యులకు, వారి అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పెడన జనసేన నాయకులు ఎస్ వి బాబు సమ్మెట అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి బాబు, కనపర్తి వెంకన్న,మహమ్మద్ సాహెబ్ (దాదా), బత్తిన రమేష్, ముదినేని రామకృష్ణ పాల్గొన్నారు.