వాలంటీర్ ముసుగులో ఉన్నది వైసిపి కార్యకర్తలే: కుమార్

పూతలపట్టు: జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కల్యాణ్ గారు కొంతమంది గ్రామ వాలంటీర్ లను (వైసిపి కార్యకర్తలు) వాడుకొని వైసిపి చేస్తున్న దోపిడినీ ప్రజలకు వివరించారు. అయితే వాలంటీర్ ముసుగు వేసుకున్న కొంతమంది వైసిపి కార్యకర్తలు మంగళవారం యాదమరి నడిబొడ్డున పవన్ కల్యాణ్ గారి దిష్టిబొ్మలను తగలపెట్టారు.. బుదవారం అదే యాదమరి నడిబొడ్డున మండల అధ్యక్షుడు కుమార్ అధ్వర్యంలో పవన్ కల్యాణ్ గారికి జనసేన నాయకులు, కార్యకర్తలు పాలభిసేకం చేసి పెయిడ్ పేటీఎం గాళ్లు చేసిన మైలను పాలతో కడిగేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శిలు భాను రాయల్, దేవినేని యశ్వంత్, ఐటీ కోఆర్డినేటర్ దేవినేని భారత్, సీనియర్ నాయకులు పూల చందు, నానబాల లోకేష్, రూపేష్, హేమాద్రి, వేముల పవన్, చంద్రా, బోయపాటి పవన్, ప్రభాకర్, మహేష్, జుబెర్ ఖాన్, వెముల యోగేష్, సాయి తిలక్, నిఖిల్ బాబు, వంశీ, లోకేష్ మరియు జనసైనికులు పాల్గోన్నారు.