మంచినీటి సమస్యను పరిష్కరించాలి: డాక్టర్ రమేష్ బాబు

రాజోలు నియోజకవర్గం: రాజోలు మండలంలో శనివారం ప్రజా సమస్యలను తెలుసుకునేందుకై పర్యటించిన జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటలో భాగంగా ప్రజలు తాము ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యలు ఆయనకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటింటికి కుళాయిలు వేయిస్తానని చెప్పిన జగన్ రెడ్డి ప్రభుత్వం ఏమైంది?. గడపగడపకు వచ్చిన ఈ వైసీపీ ప్రభుత్వం ప్రచారానికైనా! పేదవారికి మంచినీళ్లు కూడా ఇవ్వలేని అసమర్థత ప్రభుత్వం అని రమేష్ బాబు పేర్కొన్నారు.