జనసేనకు ఒక చాన్స్ ఇవ్వండి

  • కొత్తగూడెంలో జనసేన నాయకుల పర్యటన

కొత్తగూడెం నియోజకవర్గం: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలకు జనసేన పోటీ చేయనున్ననేపధ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కొత్తగూడెం నియోజకవర్గంలోని గరీబుపేట, కోమటి పల్లి నిమ్మలగూడెం, లక్ష్మీదేవి పల్లి గ్రామపంచాయతీలో జనసేన కొత్తగూడెం నియోజకవర్గం ఇంచార్జి వేముల కార్తిక్, కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ సాదిక్ పాషా, కొత్తగూడెం టౌన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయి అనిత్, చుంచుపల్లి ఆర్గనైజింగ్ సెక్రటరీ జేమ్స్, కొత్తగూడెం ఎక్జిక్యూటివ్ మెంబర్ హరీష్ తదితరులు పర్యటించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, అలాగే రాబోయే రోజుల్లో వారికి ఏ సమస్య వచ్చినా జనసేన అండగా ఉంటుందని తెలియచేసి, రాబోయే అసెంబ్లీ ఎలెక్షన్స్ లో జనసేనకి కొత్తగూడెం నియోజకవర్గంలో ఓట్ వేసి గెలిపించమని కోరడం జరిగింది.