Kakinada: రోడ్డు ప్రమాదానికి గురైన జనసైనికులకు పరామర్శ

కాకినాడ రూరల్ పరిధిలో పలు గ్రామాలను కలిపే రహదారులు గోతులతో ప్రమాదాలకు నెలవుగా మారాయి. చీడిగ – కొవ్వాడ మధ్య రోడ్డు పూర్తిగా అధ్వాన్నంగా మారిన నేపధ్యంలో వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. గురువారం ఈ రహదారిపై ప్రయాణిస్తూ ముగ్గురు జనసైనికులు ప్రమాదానికి గురయ్యారు. అందులో ఒకరికి కాలు ఫ్రాక్చర్ కూడా అయ్యింది. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు శ్రీ పంతం నానాజీ కొవ్వాడ వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం ఈ రహదారులు బాగుపడే పరిస్థితులు కనబడడం లేదన్నారు.