రావు శ్రీనివాస్ రావు మాస్టర్ కు బొబ్బిలి జనసేన పార్టీ గౌరవ సత్కారం

బొబ్బిలి పోలీసు క్రీడా ప్రాంగణంలో అగ్నిపథ్, ఆర్మీ రీక్రూట్మెంట్ కి సంబంధించి శిక్షణ ఇస్తున్న గౌరవనీయులైన రావు శ్రీనివాస్ రావు మాస్టారును ఆదివారం బొబ్బిలి జనసేన పార్టీ తరపున గౌరవప్రదంగా సత్కరించడం జరిగింది. రిటైర్డ్ ఎస్.బి.ఐ ఉద్యోగి గణపతి లను జనసేన పార్టీ తరుపున గౌరవంగా సత్కరించడం జరిగింది. యువతను ఉద్దేశించి రావు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇప్పటివరకూ డిఫెన్స్ ఉద్యోగాలుకు 60 మంది ఎంపికయ్యారని, ప్రభుత్వం చొరవ తీసుకోని బొబ్బిలిలో శిక్షణకి అనువైన మౌలిక సదుపాయాలుతో శాశ్వత గ్రౌండ్ ని అందుబాటులోకి తేస్తే మన ప్రాంతం నుంచి మరింత మంది యువతకి శిక్షణ ఇచ్చి ప్రయోజకులుగా మార్చడానికి దోహదపడగాలనని, యువతను ఎంతగానో ప్రేరేపిస్తున్న జనసేన పార్టీ ఈ విషయంలో తమవంతు కృషి చేయాలని రావు శ్రీనివాస్ కోరారు. అనంతరం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు మాట్లాడుతూ.. 70 ఏళ్ల వయసులో కూడా శ్రీ రావు శ్రీనివాస్ గారు మన ప్రాంత యువత భవిష్యత్తు కోసం చాలా ఆలోచించి తమ పూర్తి సమయాన్ని డిఫెన్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న
యువత కోసం కేటాయించడం చాలా స్ఫూర్తిదాయకం. తరువాత యువతను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి యువత చెడు వ్యసనాల బారినపడకుండా క్రమశిక్షణతో స్పోర్ట్స్, డిఫెన్స్, ఎడ్యుకేషన్, కెరీర్ పైన పూర్తి స్థాయిలో దృష్టిసారించి ప్రయోజకులై మన రాష్ట్ర, దేశ పురోగతిలో భాగస్వామ్యులు అవ్వాలని పిలుపునిచ్చారు. అలాగే సమాజంలోని అసమానతలు, ప్రభుత్వ వ్యవస్థలోని లోపాలు, ప్రజాసమస్యలును సరిచేయడానికి యువత ముఖ్య పాత్ర పోషించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, ప్రముఖ వ్యాపారవేత్త రమేష్ చౌదరి, గేదెల శివ, ఎందవ సత్య, జనసైనికులు మరియు యువత పాల్గోన్నారు.