ముద్రగడను మర్యాదపూర్వకంగా కలసిన జనసేన నాయకులు

రాజోలు నియోజకవర్గం: మలికిపురం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి మేడిచర్ల వెంకట సత్యవాణి రాము నామన నాగభూషణం, మంగేన నాగభూషణరావు, సుందర బ్రహ్మయ్య శనివారం మాజీ మంత్రి వర్యులు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరియు ముద్రగడ వారసుడు ముద్రగడ గిరిబాబుని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అనేకసార్లు మంత్రిగా పనిచేసిన వారి అనుభవం ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలలో ఎలా ఉపయోగపడుతుందన్న ఆవశ్యకతను గురించి చర్చించటం జరిగింది.