వనపర్తి జనసేన ఆత్మీయ సమావేశం

వనపర్తి, గోపాల్ పేట మండలంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు మరియు నాగర్ కర్నూల్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వంగ లక్ష్మణ్ గౌడ్ ముఖ్య అతిధిగా జనసేన ఆత్మీయ సమావేసం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ గోపాల్ పేట మండల అధ్యక్షులు మూర్తి నాయక్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ వనపర్తిలో జనసేన జెండా ఎగురవేస్తామని అన్నారు. ఈసారి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణాలో కూడా జనసేన పార్టీ బలమైన రాజకీయ శక్తిగా మారుతుందని తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు మరియు నాగర్ కర్నూల్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వంగ లక్ష్మణ్ గౌడ్ అన్నారు. దానికి అనుగుణంగా అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కో ఆర్డినేటర్ ముకుంద నాయుడు, మండల అధ్యక్షుడు మూర్తి నాయక్, ఇతర మండలాల అధ్యక్షులు సురేష్, ఉత్తేజ్ లు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.