రోడ్డా..! చేపల చెరువా..? కొల్లివలస రోడ్ పై జనసేన నిరసన

ఆమదాలవలస నియోజకవర్గం: కొల్లివలస మెయిన్ రోడ్లు చెరువులు రూపంలో మారడంతో జనసేన నాయకులు ప్రభుత్వానికి బుద్ది చెప్పే విధంగా గురువారం కొల్లివలస జంక్షన్ లో నిరసన కార్యక్రమం చేసారు. జనసేన మండల అధ్యక్షులు కొత్తకోట నాగేంద్ర, ప్రోగ్రాం కమిటీ మెంబెర్ కోరుకొండ మల్లేశ్వరావు, కొల్ల జయరాం, స్థానిక ఎంపీటీసీ సిక్కోలు విక్రమ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మేము గత ఏడాది స్పందనలో ఇచ్చాం అయినా రోడ్లు ఇలానే ఉన్నాయ్. 15రోజుల్లో ఈ రోడ్లు బాగుచేయక పోతే జనసేన ద్వారా బాగుచేసి ప్రభుత్వం నోర్లు మూసుకొని లే చేస్తాం అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సేపేన రమేష్, పొట్నూరు ప్రసాద్, మీసాల జోగినాయుడు, టంకాల రమేష్, గణ బాబు, గేదెల వినోద్ మరియు భారీ ఎత్తున జనసేన కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.