ఆంధ్ర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం 14వ వారం

పిఠాపురం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవ స్ఫూర్తితో, జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ చేతులపై ప్రారంభోత్సవం చేయబడి పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు వారు ఏర్పాటుచేసిన శ్రీమతి డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం ప్రతి శనివారం పిఠాపురం పశువుల సంత వద్ద రైతులకు అన్నసదుపాయమును కల్పించుచున్నారు. అదేవిధంగా 14వ వారం 29-07- 2023వ తేదీన శనివారం నాడు 850 మంది రైతులకు, పశువుల బేరాల మద్యవర్తులకు, వివిధ హాస్పటల్ కి వచే ఔట్ పేషెంట్లకు కలిపి అన్న సదుపాయమును కల్పించారు. శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నసదుపాయ కేంద్రం నందు జనసేన నాయకులు, సాయిప్రియ సేవాసమితి వ్యవస్దస్దాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు స్వయంగా అన్నపానీయాలను రైతులకు, పశువుల అమ్మకం మద్యవర్తులకు, హాస్పటల్ ఔట్ పేషెంట్ లకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నగర జనసేన నాయకులు అల్లంవాసు, యర్రం చంద్రరావు, బావిశెట్టి శ్రీనివాసు, అల్లం శ్రీను, ఇప్పర్తి శీను, జ్యోతుల నాని, వెదురుపాక దుర్గాప్రసాద్ తదితరులు తమ సేవలను అందించారు. శ్రీమతి డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమునకు అనేకమంది తమ సేవలందిస్తున్నారని వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయుచున్నానని ఇందుమూలంగా జ్యోతుల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలియజేశారు.