జగనన్న కాలనీల పేరిట పేదవాడి ఆశలను అమ్ముకుంటున్న వైసీపీ నేతలు: ఫణి బాబు
నూజివీడు నియోజకవర్గం: రాష్ట్రంలో ఉన్న జగనన్న కాలనీల వైఫల్యలను జనసేన పార్టీ డిజిటల్ క్యాంఫైన్ లో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నూజివీడు నియోజకవర్గ నాయకులు బర్మా ఫణి బాబు ముసునూరు మండలంలోని గోపవరం, కాట్రేనిపాడు గ్రామాలకి సంబంధించిన జగన్నన కాలనీలో పరిస్థితులు స్థానిక మహిళలతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయడం జరిగింది. అద్వాన్నంగా, వాగు పోరంబోకు స్థలాలలో చెరువుల ఉన్న కాలనీను ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా నూజివీడు నియోజకవర్గ నాయకులు బర్మా ఫణి బాబు మాట్లాడుతూ జగనన్న కాలనీల పేరిట పేదవాడి ఆశలను వైసీపీ నేతలు అమ్ముకుంటున్నారని ఎద్దేవా చేసారు. జగనన్న కాలనీల పేరిట పేదవాది ఆశలను అమ్ముకుంటున్న వైసీపీ నేతలు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పాశం నాగబాబు, కడియం సత్యనారాయణ, శ్రీను, మండల నాయకులు తిరుమలశెట్టి అనిల్, గిరి గోపి, చేబత్తిన విజయ్, మిరియాల సత్యనారాయణ, వేట త్రినాథ్, పిల్లా నాగరాజు, ఉదయ్, జనసేన నాయకులు, వీరమహిళలు, బాధితులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-29-at-7.17.33-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-29-at-7.17.32-PM-1-1024x768.jpeg)