మడమ తిప్పనన్న జగనన్న… కాలనీలు ఎక్కడ?: అచ్చనాల కేశవ్

  • జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు
  • వజ్రకరూరు మండల అధ్యక్షుడు అచ్చనాల కేశవ్

ఉరవకొండ నియోజకవర్గం: జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు జగనన్న కాలనీల సామాజిక పరిశీలన కార్యక్రమం శనివారం ఉరవకొండ నియోజకవర్గం, వజ్రకరూరు మండలం, వజ్రకరూరు మరియు కమలపాడు గ్రామాలలో మండల అధ్యక్షుడు అచ్చనాల కేశవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చనాల కేశవ్ మాట్లాడుతూ.. మా అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చేసిన జగనన్న కాలనీల సామాజిక పరిశీలన కార్యక్రమంలో ముఖ్యంగా మాకు అర్థమైంది గత ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇళ్ల నిర్మాణం పూర్తిగా గాలికి వదిలేశారు, జగనన్న ముఖ్యమంత్రి లబ్ధిదారులకు అందరికి ఇల్లు కేటాయించాలని ప్రశ్నించారు. ప్రధానంగా జగనన్న కాలనీలో మౌలిక వసతుల కల్పన పేరిట వైసిపి ప్రభుత్వం కొన్ని కోట్ల ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తుంది. ఇక్కడ చూస్తే ఎటువంటి మౌలిక వసతులు లేవు. ఆ కోట్లు ఎటు పోతున్నాయి. ప్రతి జగనన్న కాలనీలో రోడ్లు, వీధి దీపాలు, పార్కులు, గ్రంథాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మిస్తామని రకరకాల కబుర్లు చెప్పి ప్రజల్ని మోసం చేస్తూనే ఉంది. మౌలిక వసతుల పేరిట ఈ ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించాం. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ప్రజా ఆగ్రహానికి గురికాకముందే పేదవాడి సొంతింటి కల నిజం చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వజ్రకరూరు మండల ఉపాధ్యక్షులు హరిశంకర్ నాయక్, ప్రధాన కార్యదర్శులు సూర్యనారాయణ, గణేష్ మరియూ మండల నాయకులు హరీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.