ప్రైమ్9 యూట్యూబ్ చానెల్ మిలియన్ సబ్ స్క్రైబర్స్ వేడుకలు

వైజాగ్: ఆప్ సబ్ కీ ఆవాజ్ మరియు ట్రాయ్ యాప్ టీమ్ కలిసి ప్రైమ్9 యూ ట్యూబ్ చానెల్ మిలియన్ ప్రైమ్9 యూట్యూబ్ చానెల్ మిలియన్ సబ్ స్క్రైబర్స్ పూర్తి అయిన సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆప్ సబ్ కీ ఆవాజ్ సంస్థ ప్రెసిడెంట్ శివ్ వడ్లమూడి సెక్రెటరీ బావిశెట్టి కిరణ్ కుమార్, సంస్థ ప్రతినిధులు కొమ్ముల భార్గవ్ వంశీ మరియు ట్రాయ్ యాప్ టీమ్ భాస్కర్ కొండేటి, సూర్య ప్రకాష్ పోలిశెట్టి, సుబ్బు విశ్వనాధం, కొమిరిశెట్టి నాని బాబు, పతివాడ విద్యాసాగర్, ప్రభాకర్ హాజరై వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బావిశెట్టి కిరణ్ కుమార్ మాట్లాడుతూ నిష్పక్షపాతంగా ప్రజలకు వార్తలు అందిస్తున్న ఏకైక ఛానెల్ ప్రైమ్9 ఛానెల్ అని, ఛానెల్ చైర్మన్ రఘువీర్ శ్రీనివాస్, మరియు సిఇవో వెంకటేశ్వర రావు లకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అలాగే యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.