డ్రైనేజీ కాలువలు నిర్మించండి: జనసేన డిమాండ్

  • డ్రైనేజీ కాలువ లేనందున ఇబ్బంది పడుతున్న గృహస్తులుకు బాసటగా నిలబడి పోరాటం చేస్తున్న జనసేన

పాలకొండ నియోజకవర్గం: జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు మరియు కూరంగి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మురికి కాలువ సమస్యపై పాలకొండ మండలం వడమ కాలనీలో చెరువుకు అనుకొని తూర్పు భాగంలో ఉన్న 7వ వార్డులో బలివాడ సాయి ఇంటి నుండి అక్కడ నివసిస్తున్న గృహస్థుల ఇండ్ల నుండి వచ్చే మురికి నీరు, వర్షం నీరు మరియు డ్రైనేజ్ వాటర్ పోయేందుకు డ్రైనేజీ కాలువ లేని కారణంగా అక్కడ మురికి నీరు నిలవగా ఉండిపోవడంతో ఆ వీధిలో ఉన్న ప్రజలు టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, ఇలా రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. దోమల సమస్య కూడా తీవ్రంగా ఉండటంతో ప్రజలకు అనారోగ్య పరిస్థితులు ఎక్కువ అవుతున్నాయి. కావున ఇక్కడ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, స్థానిక ప్రజలతో మున్సిపల్ కమిషనర్ వారికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ వారు పరిశీలించి తగు చర్యలు వెంటనే తీసుకోవాలని సత్తిబాబు కోరారు. సమస్యపై వెంటనే చర్యలు తీసుకుంటామని కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో వారాడ గజేంద్ర నాయుడు, ద్వారపుడి ప్రసాద్, మిడితాన ప్రసాద్, వండాన సాయి, గర్భాపు నరేంద్ర, డొంపాక, సాయి, మాదాసు సంతోష్, సుబ్బు, మామిడి గజేంద్ర, బి భావాని, గెంబలి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.