అనుపాలెం గ్రామంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

సత్తెనపల్లి నియోజకవర్గం: రాజుపాలెం మండలం, అనుపాలెం గ్రామంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అనుపాలెం జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు, తోట లక్ష్మీనారాయణ చేతుల మీదుగా సభ్యత్వం కిట్లను పంచడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తల కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించారని అన్నారు.
అలాగే మనం 500 రూపాయలు కడితే, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కార్యకర్తల కోసం తన కష్టపడ్డ సొంత సొమ్మును 2000 రూపాయలు కలిపి, తన సొంత డబ్బును ఇన్సూరెన్స్ గా కట్టి, జనసేన కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని చెప్పడం జరిగినది. కార్యకర్తల కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించారాని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ, క్రియాశీలక, రాజుపాలెం మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, పరిమి శీను, అనుపాలెం ఉపాధ్యక్షులు, అయినవోలు కోటి, అయినవోలు కొండ, నాయకులు, వీర్ల బ్రహ్మేశ్వరరావు, వీర్ల సతీష్, పసుపులేటి బాల, జనసైనికులు బాజీ, రమేష్, శివ మణికంఠ పాల్గొన్నారు.