పాపిశెట్టిపాలెం గ్రామంలో ఇంటింటికి పవనన్న ప్రజాబాట

సత్తెనపల్లి నియోజకవర్గం: నకరికల్లు మండలం, పాపిశెట్టిపాలెం గ్రామంలో సోమవారం నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మీ శ్రీనివాస్, గ్రామ కమిటీ మరియు గ్రామ జనసైనికుల ఆహ్వానం మేరకు ఇంటింటికి పవనన్న ప్రజాబాట కార్యక్రమం నిర్వహించడం జరిగినది. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ఆశయాలను గాజు గ్లాసును జనాల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మండల అధ్యక్షులు, కౌన్సిలర్, జిల్లా నాయకులు, ప్రోగ్రాం కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, గ్రామ అధ్యక్షులు, గ్రామ కమిటీ సభ్యులు, వీరమహిళలు, జన సైనికులు పాల్గొన్నారు.