కాకినాడ రూరల్ జనసేన ఆధ్వర్యంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

  • ఈశ్వర్ నగర్ రెల్లిపేట ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

కాకినాడ రూరల్ మండలం ఈశ్వర్ నగర్ రెల్లిపేట ప్రాంతంలో జనసేన పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి తాటికాయల వీరబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, పంతం నానాజీగారు ఆదేశాలతో స్థానిక మహిళలకు 100 చీరలు, పళ్ళు, పంపిణీ కార్యక్రమం నిర్వహించడ, జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొని మహిళలకు చీరలు, పళ్ళు అందించిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ తనయుడు యువ నాయకులు పంతం సందీప్. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా స్థానిక జనసైనికులు కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసైనికులు, రాష్ట్ర నాయకులు, జిల్లా, సిటీ, మండల, గ్రామ నాయకులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.

  • 60 వేలు విలువ చేసే దోమల మెస్ బహుకరణ

కాకినాడ రూరల్ నియోజకవర్గం, కరప మండలం, కరప గ్రామంలో గల సాంఘిక సంక్షేమ వసతి గృహంలో గల విద్యార్థులు దోమ కాటులకు ఇబ్బంది పడుతున్న కారణంగా కరప గ్రామ జనసైనికులు ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, పంతం నానాజీ ఆదేశాలతో బీసీ హాస్టల్ కి సుమారు 60 వేలు విలువ చేసే దోమల మెస్ లు తదేకం ఫౌండేషన్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన వాటిని శనివారం పంతం సందీప్ చేతులమీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక జనసైనికులు, రాష్ట్ర నాయకులు, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.

  • దివ్యాంగులకు చేయూత

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా, జనసేన పార్టీ పిఏసి సభ్యులు పంతం నానాజీ ఆదేశాల మేరకు శనివారం కాకినాడ గోడారిగుంటలో జనసేన కార్యాలయం వద్ద తదేకం ఫౌండేషన్ వారి ఆర్థిక సహకారంతో ఫౌండేషన్ ప్రతినిధి శాండీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు 6 ట్రై సైకిల్స్, ఒక వీల్ చైర్ మరియు 30 మంది దివ్యంగులకు ఒక నెలకి సరిపడా నిత్యావసర వస్తువులను పంతం నానాజీ తనయుడు, యువ నాయకులు పంతం సందీప్ చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమం లో కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.

  • కొవ్వాడలో రక్తదాన శిబిరం

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా, జనసేన పార్టీ పిఏసి సభ్యులు పంతం నానాజీ ఆదేశాల మేరకు శనివారం కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామం సాయిబాబా గుడి వద్ద స్థానిక జనసైనికులు చింతలపూడి నాని ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిభిరాన్ని యువనాయకుడు పంతం సందీప్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.