ఓటరు జాబితా అవగాహన సదస్సులో పాల్గొన్న జనసైనికులు

పలాస నియోజకవర్గం: పలాసలోని ఎం.ఆర్.ఓ ఆఫీస్ లో ఈ.ఆర్.ఓ ఆధ్వర్యములో ఎన్నికల అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఓటర్ల జాబితాపై అవగాహన మరియు బి.ఎల్.ఓ లతో కలసి ఓటర్ల మార్పులు చేర్పులు, అలాగే దోంగ ఓటర్లను గుర్తించటం లాంటి అంశాల గురించి మాట్లాడటం జరిగింది. ఈ సమావేశంలో పలాస జనసేన సీనియర్ జనసైనికులు కోన క్రిష్ణారావు, వజ్రపుకొత్తూరు మండలం నుండి పుక్కళ్ళ శంకర్(ఉమా మహేష్) మరియు టిడిపి, వైసీపీ, కాంగ్రెస్, సీపీఎం పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ మీటింగ్ కు ఎలక్షన్ డెప్యూటీ తహశీల్దార్, పలాస, వజ్రపుకొత్తూరు, మందస ఎం.ఆర్.ఓ లు, ఇతర అధికార్లు పాల్గొన్నారు.