గుడ్ మార్నింగ్ సీఎం సార్ డిజిటల్ క్యాంపెయిన్ లో పెండ్యాల శ్రీలత

అనంతపురం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు అనంతపురం అర్భన్ నియోజకవర్గం లక్ష్మి నగర్, శ్రీనగర్ కాలనీలలో రోడ్ల అధ్వాన్న స్థితిపై జనసేన పార్టీ రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత గుడ్ మార్నింగ్ సీఎం సార్ పేరుతో డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అరకొర పథకాలకే పరిమితమై అభివృద్ధిని జగన్ ప్రభుత్వం మర్చిపోయిందని ఎద్దేవా చేశారు. నగరంలో సైడ్ కాలువలు సరిగా లేక మురుగునీరు గుంతలు ఉన్న రోడ్లలో చేరి నగర ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని ప్రభుత్వం ఎలాగో గత మూడు సంవత్సరాలు మొద్దు నిద్రలో ఉందని ఇప్పటికైనా నిద్రలేచి రోడ్లు, కాలువలు పూర్తి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిటీ సభ్యురాలు పసుపులేటి పద్మావతి, జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవ రాయుడు, నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి, వీరమహిలలు కాశెట్టి సావిత్రి, గుమ్మడిసాని శిల్పా, నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్, మురళి, సాయికుమార్, రామయ్య, హరికృష్ణ, బద్రి తదితరులు పాల్గొనడం జరిగింది.