జనసేన బలోపేతానికి కృషి చేయండి: బంగారు రామదాసు

అరకు నియోజకవర్గం: డుంబ్రిగూడ మండలంలో జనసేన పార్టీ అరకు నియోజకవర్గ నాయకులు బంగారు రామదాసు ఆధ్వర్యంలో డుంబ్రిగూడ మండలంలో జనసేన పార్టీ బలోపేతం కొరకు జనసేన పార్టీ జనసేన సైనికులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ అరకు నియోజకవర్గ నాయకుడు బంగురు రామదాసు మాట్లాడుతూ.. ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు లేక ఉపాధి అవకాశాల కోసం వేరే ప్రాంతంలో కూలీలకు వెళ్లి కూలీ చేసుకోవలసిన అవసరం వస్తుంది. కనుక అరకు నియోజకవర్గంలో అరకులో టూరిజం శాఖ అభివృద్ధి చేస్తూ అలాగే గిరిజన మన్య ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైసిపి పార్టీ వరకు ఆ దిశగా వెళ్ళలేని పరిస్థితిలో ఉండటం దురదృష్టకరమని అలాగే మన గ్రామ పరిస్థితిల్లో గాని, పంచాయతీ పరిస్థితిలో గాని అభివృద్ధి లేకపోవడం వల్ల ప్రతి పంచాయతీల్లో జనసేన పార్టీ ద్వారా ఆ సమస్యను బయటకు తీసుకొచ్చి ప్రజాధికారులకు తెలియపరచాలని, అలాగే జనసేన పార్టీని ప్రతి పంచాయతీలో బలోపేతం చేయాలని జనసేన పార్టీ నాయకుడు బంగారు రామదాసు అరకు నియోజకవర్గం డుంబ్రిగూడ మండలంలో ప్రతి పంచాయతీ జనసేన పార్టీ జనసేన సైనికులతో సమావేశము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జనసైనికులు గొల్లూరి చందు ఉపేంద్ర మరియు తదితరులు పాల్గొన్నారు.