అనంతపురం జనసేన మహిళా కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

  • ఎందరో త్యాగధనుల కృషి ఫలితమే నేటి ఈ స్వతంత్ర భారతం
  • స్వతంత్ర ఉద్యమంలో మహిళల పాత్ర మరువలేనిది

అనంతపురం: భవ్య భారత నిర్మాణానికి యువత నడుం బిగించాలని జనసేన పార్టీ మహిళా విభాగం రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని జనసేన పార్టీ మహిళా కార్యాలయం నందు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వారు జెండా వందనం చేసి స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పెండ్యాల శ్రీలత మాట్లాడుతూ ఎందరో మహనీయుల ప్రాణత్యాగలు, పోరాటల ఫలితమే నేటి ఈ స్వాతంత్ర్య భారతమని అన్నారు. యోధులు కలలుగన్న భవ్య భారతదేశ స్థాపనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించి బంగారు బాటలు వేసి వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనంతపురం నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి, వీర మహిళలు శైలజ, లక్ష్మి, శ్రీదేవి, ధార్భి, జయంతి నాయకులు సాదినేని కార్తిక్, ప్రసాద్, వృత్తి విద్యలో శిక్షణ పొందు మహిళలు తదితరులు పాల్గొనడం జరిగింది.