అనంతపురం జనసేన మహిళా కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- ఎందరో త్యాగధనుల కృషి ఫలితమే నేటి ఈ స్వతంత్ర భారతం
- స్వతంత్ర ఉద్యమంలో మహిళల పాత్ర మరువలేనిది
అనంతపురం: భవ్య భారత నిర్మాణానికి యువత నడుం బిగించాలని జనసేన పార్టీ మహిళా విభాగం రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని జనసేన పార్టీ మహిళా కార్యాలయం నందు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వారు జెండా వందనం చేసి స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పెండ్యాల శ్రీలత మాట్లాడుతూ ఎందరో మహనీయుల ప్రాణత్యాగలు, పోరాటల ఫలితమే నేటి ఈ స్వాతంత్ర్య భారతమని అన్నారు. యోధులు కలలుగన్న భవ్య భారతదేశ స్థాపనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించి బంగారు బాటలు వేసి వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనంతపురం నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి, వీర మహిళలు శైలజ, లక్ష్మి, శ్రీదేవి, ధార్భి, జయంతి నాయకులు సాదినేని కార్తిక్, ప్రసాద్, వృత్తి విద్యలో శిక్షణ పొందు మహిళలు తదితరులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-15-at-1.58.39-PM-1024x577.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-15-at-1.58.40-PM-576x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-15-at-1.58.41-PM-1024x562.jpeg)