డొక్కాపాలెంలో జనసేన ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

రంపచోడవరం నియోజకవర్గం: భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా అడ్డతీగల పంచాయతీ పరిధిలో డొక్కాపాలెం గ్రామంలో జండా ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో 31 మంది చిన్నారులకు పుస్తకాలు, పెన్నలు, చాక్లెట్స్ పంచడం జరిగింది. మరియు అడ్డతీగల సెంటర్లో గాంధీ గారి విగ్రహానికి పువ్వులమాల వేసి పోలీస్ స్టేషన్ ఆవరణలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ శ్రీనివాస్, ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎం దెంగేటి సత్తిబాబు, జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం, చోళ్ళ కృష్ణారెడ్డి, పొడుగు సాయి, కుప్పాల మణికంఠ, టీచర్స్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొనడం జరిగింది.