ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ కు అధికారుల గైర్హాజరు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై విజయవాడలోని ఎస్‌ఈసీ కార్యాలయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో ఇతర ఎన్నికల అధికారులు హాజరయ్యారు. కానీ రాష్ట్ర సీఎస్, డీజీపీ, పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులు హాజరు కాలేదు. ఈ సమావేశానికి అనంతపురం, ప్రకాశం, కడప, గుంటూరు జిల్లాల అధికారులు హాజరు కాలేదు. పలువురు అధికారులు టెక్నికల్ ఎర్రర్ ఉంది అని చెబుతున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ఆన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా హాజరు కావల్సిన అధికారుల కోసం ఈసీ అధికారులు ఎదురుచూస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశం కొనసాగనుంది.