పార్వతీపురం జనసేన ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన వారోత్సవాలు

  • జనసేనాని జన్మదిన వారోత్సవాలలో భాగంగా జనసేనలో భారీ చేరికలు

పార్వతీపురం నియోజకవర్గం: జనసేనాని జన్మదిన వారోత్సవాలలో భాగంగా మొదట రోజు పార్వతీపురం నియోజకవర్గం నాయకులు అక్కివరపు మోహన్ రావు ఆధ్వర్యంలో మరియు మండల అధ్యక్షురాలు శ్రీమతి ఆగూరు మణి, పార్వతిపురం జనసేన పార్టీ సమక్షంలో ముఖ్య అతిధిగా రాష్ట్ర ఐటీ వింగ్ సభ్యులు గేదెల సతీష్ బుదురువాడ గ్రామ పంచాయితీలో గల 50 కుటుంబాలు జనసేనలో చేరడం జరిగింది. ఈ బృహత్కార కార్యక్రమంలో రాజన బాలు, బొనేల గోవిందమ్మ, ఖాతా విశ్వేశ్వరావు, గుంట్రెడ్డి గౌరిశంకర్, అల్లు రమేష్, గొలగాన సత్యన్నారాయణ, కర్రి మణికంఠ, చిట్లి గణేశ్వర రావు, అన్నబత్తుల దుర్గప్రసాద్, అంబటి బలరాం, కనకరాజు, పైల రాజు, దుర్గ ప్రసాద్, చంద్రశేఖర్, జీలకర్ర భాస్కర్, కృప, ఆ గ్రామ జనసైనికులు, వీర మహిళలు, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం లో మన పార్టీ నాయకులు ఆ గ్రామంలో గల సమస్యలను అడిగి తెలుసుకొని తీర్చే భాద్యత ను తీసుకుంటామని వారికీ భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే మన పార్టీ సిద్ధాంతాలను, పార్టీ సణ్ముఖ వ్యూహం గూర్చి ఆ గ్రామ ప్రజలకు, యువతకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో పాల్గొన్న ప్రతి జనసైనికులకి, వీరమహిళలకు పేరు పేరునా ధన్యవాదములు తెలిపారు.