కోటి గ్రామంలో జనసేన పక్షాన సిమెంట్ బెంచీల ఏర్పాటు

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, కోటి గ్రామంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో రాజానగరం నియోజకవర్గం, జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణని ఆదర్శంగా తీసుకుని కోటి గ్రామం జనసేన పార్టీ వారు కోటి గ్రామం ప్రధాన కూడలిలో గ్రామస్తులు కూర్చునే సౌకర్యార్థం పలుచోట్ల సిమెంట్ సోఫాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ప్రారంభించి ఈ బెంచీలు అందించిన నండూరి ఆంజనేయులు ను అభినందించారు. గ్రామంలోని అంబేద్కర్ గారి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరూ ఇదే మాదిరిగా సేవాగుణం కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ మేడిశెట్టి శివరాం, నండూరి ఆంజనేయులు, తన్నీరు తాతాజీ, నండూరి మంగరాజు, నండూరి శ్రీరామ్ మూర్తి, నండూరి కృష్ణ, చదువు నాగు, చదువు ముక్తేశ్వరరావు, దేవన కృష్ణ, ఉల్లి సూరన్న కాపు, అడబాల కృష్ణ, దేవుళ్ళు, రమణయ్య, గట్టి వంశీ, గట్టి శ్రీను, గణసల సురేష్, కేశంశెట్టి కాపు, దూరం మనీ, తోట అనిల్ వాసు, దేవన దుర్గ ప్రసాద్ (డిడి), యర్రంశెట్టి పోలారావు, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.