తెలుగు భాషా దినోత్సవం – జనసేన ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు

తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తాడిపత్రిలోని పప్పూరు రోడ్డులో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ నందు మధ్యాహ్నం జనసేన పార్టీ తరఫున వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. పోటీలో గెలుపొందిన వారికి ఇంచార్జ్ గది శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు బహూకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారు తెలుగు భాష కోసం చేసిన కృషి గురించి మరియు ఆయన సమాజం కోసం పడిన తపన గురించి తెలియజేయడం జరిగింది. ఇలాంటి మహనీయుల అడుగుజాడల్లో మనమందరం నడవాలని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కిరణ్ కుమార్, పట్టణ ఉపాధ్యక్షులు గోపాల్ మరియు అయూబ్, కొండా శివ, రసూల్, రమణ తదితరులు పాల్గొన్నారు.