శ్రీ దుర్గా మల్లేశ్వరి అమ్మవారికి ఇత్తడి పంచలోహాల ఆభరణాలు

ఏలూరు నియోజకవర్గం: ఏలూరులోని స్థానిక 35, 40 డివిజన్ లో 12పంపులు సెంటర్ లోని శ్రీ దుర్గా మల్లేశ్వరి అమ్మవారికి జనసేన నాయకులు బోరాడ పూర్ణ ఆధ్వర్యంలో ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు చేతుల మీదగా అమ్మవారికి ఇత్తడి పంచలోహాలు సెట్టు సమర్పించడం జరిగింది. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కార్యదర్శి ఎట్రించి ధర్మేంద్ర డివిజన్ నాయకులు భక్తులు పాల్గొన్నారు.