ప్రజల ఆశీస్సులే పవన్ కళ్యాణ్ కు శ్రీరామరక్ష

  • వాడవాడలా ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు
  • పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టిన జనసేన నేతలు
  • వచ్చే ఏడాది ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
  • గుంటూరు నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు: మంచి మనసుతో ప్రజలు అందించే ఆశీస్సులే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు శ్రీరామరక్ష అని నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శనివారం పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని 57 డివిజన్లలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీటికి తోడు పార్టీ అధిష్టానం ఇచ్చిన సూచనల మేరకు భవన నిర్మాణ కార్మికులతో సహపంక్తి భోజనం, రెల్లి ప్రజల మధ్య పుట్టినరోజు వేడుకలు, రక్తదానం, సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, దివ్యాంగులకు ట్రై సైకిళ్ళ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు భారీగా చేపట్టారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకై ప్రతీఒక్కరూ కృషి చేయాలని కోరారు. డబ్బు, అధికారం పట్ల వ్యామోహం లేని వ్యక్తి, కులపిచ్చి, మతపిచ్చి తెలియని మహామనిషి పవన్ కళ్యాణ్ అంటూ కొనియాడారు. జగణాసుర రాజ్యం పోయి రామరాజ్యం రావాలంటే జనసేనకు అండగా నిలవాలని ప్రజల్ని కోరారు. ఇప్పుడు జనసేన పార్టీ అధినేతగా పుట్టినరోజు జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్ వచ్చే పుట్టినరోజు వేడుకలను ముఖ్యమంత్రి హోదాలో జరుపుకుంటారని జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా నగరంలో జనసైనికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ వేడుకలను రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయబాబు స్వయంగా రక్తదానం చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, నగర కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.